సీమాంధ్ర ప్రాంతంలో కొనసాగుతున్న బంద్పై హీరో నవదీప్ ట్విట్టర్లో వివాదాస్పద వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. ''నేడే చూడండి!! మీ అభిమాన టీవీ చానళ్లలో!!! ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ హైడ్రామా!! ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదు, ఇక ముందు కూడా చూడరు!!!!!!!!!!!!!!!" అని ట్వీట్ చేశాడు.
Neede chudandi!! Mee abhimana tv channels lo!!! Andhra pradesh political highdrama!! Never before and never again!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
— Navdeep (@pnavdeep26) October 3, 2013
సాధారణంగా రాజకీయ నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నా.. సినీ పరిశ్రమకు చెందిన వారు మాత్రం ఇన్నాళ్లూ వివాదాలకు దూరంగా ఉండేవారు. తొలిసారిగా నవదీప్ దాన్ని బ్రేక్ చేసి వివాదాస్పదమైన కామెంట్ పోస్ట్ చేశాడు.
Andhra pradesh at the rate of #ad collections and ministers resignations !!! Ohmymy whats happening !!
— Navdeep (@pnavdeep26) October 4, 2013
''ఆంధ్రప్రదేశ్లో అన్నీ ప్రకటనల కలెక్షన్లు, మంత్రుల రాజీనామాలే!! ఓరి దేవుడా.. ఏం జరుగుతోంది!! ఈ విషయంలో ఏమీ చేయలేం గానీ సీమాంధ్రలో అసలేం జరుగుతోంది? అక్కడ పనిచేస్తున్న ప్రభుత్వోద్యోగులంటే.. కేవలం పోలీసులే. వాళ్లు కూడా సహాయ నిరాకరణ ప్రారంభిస్తున్నారు!!" అంటూ కూడా నవదీప్ ట్వీట్ చేశాడు.
Cant help but think whats gonna happen in seemandhra if d only working govt representatives - THE POLICE, starts non-cooperation too!!
— Navdeep (@pnavdeep26) October 4, 2013
సినీ పరిశ్రమకు చెందిన అనేకమంది సీనియర్లు, ఎప్పుడూ ట్విట్టర్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రాంగోపాల్ వర్మ కూడా దీని గురించి ఏమీ స్పందించని సమయంలోనూ నవదీప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.