నేడు వైఎస్‌ఆర్‌ సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

29 Jan, 2017 07:01 IST|Sakshi
నేడు వైఎస్‌ఆర్‌ సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

హైదరాబాద్‌: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఆదివారం జరగనుంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి పార్టీ ఎంపీలందరూ హాజరవుతారు.  పార్లమెంట్‌ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించే విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే దిశగా చర్చలు జరపనున్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ఆర్‌ సీపీ పోరాడుతున్న సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు