100 మందికి విషజ్వరాలు

22 Aug, 2015 10:01 IST|Sakshi

గుంటూరు: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం మంచికలపూడి గ్రామంలో 100 మందికి పైగా విషజ్వరాలతో మంచానపడ్డారు. గత కొద్ది రోజులుగా గ్రామంలో విషజ్వరాలు ప్రభలినట్టు సమాచారం. కాగా, శుక్రవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది గ్రామంలోని రోగుల రక్త నమూనాలను సేకరించారు. ఆరోగ్య అధికారులు స్పందించి ఇప్పటికైనా గ్రామంలో ప్రత్యేక హెల్త్ క్యాంపును నిర్వహించి.. మెరుగైన వైద్యం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు