రోడ్డుప్రమాదంలో డ్రైవర్ మృతి

2 Sep, 2015 16:26 IST|Sakshi

పరుచూరు (ప్రకాశం జిల్లా): గన్నవరం- మార్టూరు మార్గమధ్యలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందాడు. వివరాలు.. ప్రకాశం జిల్లా పరుచూరు మడలం పెద్దనపూడి సమీపంలో టాటాఏస్ వాహనం - ట్రాక్టర్ ఢీకొన్న సంఘటనలో డ్రైవర్ మైలా సురేష్ (27) అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య శిరీష, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు