ఆ గ్రామాలకు రాకపోకలు బంద్

30 Nov, 2015 14:18 IST|Sakshi

భారీ వర్షాలు నెల్లూరు జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం లోని కలుజు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు పొంగటంతో చుట్టు పక్కల ఉన్న 18 గ్రామాలకు సోమవారం ఉదయం నుంచే రాకపోకలు నిలిచిపోయాయి. వారం రోజుల క్రితం ఇదే ప్రాంతంలో వాగులో పడి ఇద్దరు వ్యక్తులు గల్లంతైయ్యారు. ఈ నేపథ్యంలో స్థానికులు భయాందోళనకు గురైతున్నారు.



 

మరిన్ని వార్తలు