ఉత్తరాంధ్రలో రైళ్ల రాకపోకలకు అంతరాయం

27 May, 2015 10:05 IST|Sakshi

జామి: విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో ఆ మార్గంలో ప్రయాణించాల్సిన అన్ని రైలు సర్వీసుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గూడ్స్ బోగీలు పడిపోవడంతో పాటు ఐదు విద్యుత్ స్తంబాలు కూడా నేలకూలాయి.

దీంతో రైల్వే అధికారులు విశాఖ-పలాస, విశాఖ-విజయనగరం లోకల్ రైలు సర్వీసులను రద్దు చేశారు. ఇక హౌరా-చెన్నై, కోరాపుట్, కోర్బా, కోణార్క్ తదితర రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రైళ్లను దారి మళ్లించడంతో సర్వీసులు ఆలస్యం అవుతన్నాయి.

మరిన్ని వార్తలు