సాక్షి, హైదరాబాద్: కీలకమైన విశాఖపట్నం పోలీస్ కమిషనర్గా అమిత్గార్గ్ నియమితులయ్యారు. ఎర్రచందనం యాంటీ స్మగ్లింగ్ టాస్క్ఫోర్స్ అధిపతిగా (డీఐజీ) ఎం.కాంతారావు, ట్రాన్స్కో విజిలెన్స్ విభాగం జేఎండీగా ఉమాపతిని నియమించారు. ఈ మేరకు పలువురు ఐపీఎస్లను బదిలీ చేయడంతోపాటు ప్రస్తుతం వెయిటింగ్లో ఉన్న వారికి పోస్టింగ్లు ఇస్తూ ప్రభుత్వం శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.