గిరిజన హక్కుల రక్షణకు కొత్త చట్టం..

18 Jun, 2020 19:44 IST|Sakshi

 గిరిజన సలహా మండలి సమావేశం తీర్మానం

సాక్షి, తాడేపల్లి: డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి అధ్యక్షతన గిరిజన సలహా మండలి సమావేశం గురువారం జరిగింది. గిరిజన ప్రాంత ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో పుష్పశ్రీవాణి మాట్లాడుతూ జీవో 3 పై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని  తీర్మానం చేశామని పేర్కొన్నారు. గిరిజనుల హక్కులు కాపాడేందుకు కొత్త చట్టాన్ని తేవాలని తీర్మానం చేశామన్నారు. గిరిజనుల కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలను అభినందిస్తూ తీర్మానం చేశామని వెల్లడించారు. జీవో 3పై తెలంగాణ అధికారులతో కూడా చర్చించామని పుష్పశ్రీవాణి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు