జేసీ దివాకర్‌ రెడ్డిని ఎంపీ పదవి నుంచి తొలగించాలి

1 Jun, 2018 12:54 IST|Sakshi
జేసీ దివాకర్‌ రెడ్డి (ఫైల్‌ఫోటో)

సాక్షి, కర్నూలు : తెలుగు దేశం పార్టీ ‘‘మహానాడు’’ కార్యక్రమంలో ఎరుకలి కులస్థులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డిని ఎంపీ పదవి నుంచి తొలగించాలని ‘‘ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్’’ సభ్యులు డిమాండ్‌ చేశారు. జేసీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. శుక్రవారం కర్నూలు నగరంలో జేసీ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కర్నూలు బిర్లాగేట్‌ సర్కిల్‌ వద్ద ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జేసీ దివాకర్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

>
మరిన్ని వార్తలు