జెఏసి సమావేశానికి హాజరుకాని టిఆర్ఎస్

27 Jul, 2013 21:18 IST|Sakshi

హైదరాబాద్: తెలంగాణ రాజకీయ జేఏసీ సమావేశానికి  టీఆర్‌ఎస్ హాజరుకాలేదు. ఈ రోజు ఇక్కడ జరిగిన సమావేశం ముగిసిన తరువాత జెఏసి చైర్మన్ కోదండరామ్ మాట్లాడుతూ రాయల తెలంగాణను అంగీకరించే ప్రసక్తే లేదని చెప్పారు. 10 జిల్లాలతో కూడిన తెలంగాణకే తమ అంగీకారం తెలుపుతామన్నారు.

పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టి ఆమోదించే వరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందన్నారు.  ఇదే అంశంపై ఆగస్టు 1న ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తామని చెప్పారు.  సీమాంధ్ర ప్రాంత ప్రజలకు తాము వ్యతిరేకం కాదన్నారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయి అభివృద్ధి సాధిస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు