టీఎస్‌ఆర్టీసీ లోగోను ఆవిష్కరించిన మంత్రి మహేందర్

21 May, 2015 15:20 IST|Sakshi
టీఎస్‌ఆర్టీసీ లోగోను ఆవిష్కరించిన మంత్రి మహేందర్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) లోగోను తెలంగాణ రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఈ లోగోను జ్ఞానేశ్వర్ అనే కళాకారుడు రూపొందించాడు. రౌండెడ్ ఫ్రేమ్‌లో కాకతీయ కళాతోరణం, కళాతోరణం మధ్యలో చార్మినార్, తెలుపు రంగులో రహదారి, రహదారి మధ్యలో గీతలు ఉన్నాయి.  ప్రగతి రథం, ప్రజల నేస్తం అనే తెలుగు స్లోగన్ కూడా ఈ లోగోలో భాగమయ్యింది.

మరిన్ని వార్తలు