తాడేపల్లి కేంద్రంగా టీటీడీ చైర్మన్‌ క్యాంపు కార్యాలయం

15 Jul, 2019 21:00 IST|Sakshi

సాక్షి, అమరావతి : టీటీడీలో నూతన సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి. తాడేపల్లి కేంద్రంగా టీటీడీ చైర్మన్‌ క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. చైర్మన్‌ ఆదేశాలతో నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసే పనిలో టీటీడీ అధికారులు నిమగ్నమయ్యారు. తాడేపల్లి ఆఫీసులో ఆరుగురు ఉద్యోగులను నియమించాలని సర్వీసెస్ డిప్యూటీ ఈఓను విజయవాడ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈఓ రాజేంద్రుడు కోరారు.

>
మరిన్ని వార్తలు