టీటీడీ నష్టాల్లో ఉంది.. ఆదుకోండి

13 Jul, 2020 18:18 IST|Sakshi

కేంద్ర ఆర్థిక మంత్రికి వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి

సాక్షి, ఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సోమవారం భేటీ అయ్యారు. టీటీడీ వద్ద ఉన్న పాత నోట్లు, భక్తుల కానుకలను డబ్బుల రూపంలో మార్చేందుకు  అనుమతి ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరారు. పోలవరం, వెనుకబడిన జిల్లాలకు నిధులు వెంటనే ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. లాక్‌డౌన్ కారణంగా టీటీడీకి రెవెన్యూ లేదని, కష్టాల్లో ఉన్న సంస్థను ఆదుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రికి  వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు