కాంచీపురంలో టీటీడీ చైర్మన్‌

16 Jul, 2019 16:17 IST|Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడులోని కాంచీపురం అత్తి వరదర్‌ స్వామి ఆలయాన్ని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు మంగళవారం దర్శించుకున్నారు. టీటీడీ తరపున సుబ్బారెడ్డి దంపతులు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ పర్యటనలో వారితో పాటు టీటీడీ ఉన్నతాధికారులు, వేదపండితులు కూడా ఉన్నారు. వీరు స్వామివారి ప్రత్యేక పూజలను దగ్గరుండి తిలకించారు.

మరిన్ని వార్తలు