టీటీడీ డైరీలు, క్యాలెండర్లకు ఆన్‌లైన్‌ బుకింగ్‌

8 Dec, 2017 04:52 IST|Sakshi

తిరుపతి అర్బన్‌: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)– 2018 డైరీలు, క్యాలెండర్ల కోసం భక్తులు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే అవకాశం కల్పించినట్టు ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. తిరుపతిలోని పరిపాలన భవనంలో జేఈవో పోలా భాస్కర్‌తో కలసి  ఆన్‌లైన్‌ బుకింగ్‌ ప్రక్రియను ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా ఉన్న టీటీడీ సమాచార కేంద్రాల్లో ఈ డైరీలు, క్యాలెండర్లను అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. వీటిని ttdsevaonline.com వెబ్‌సైట్‌ ద్వారా ఆర్డర్‌ చేయొచ్చన్నారు.

మరిన్ని వార్తలు