తిరుమల: భక్తులను దృష్టిలో పెట్టుకుని టిటిడి పాలకమండలి పలు నిర్ణయాలు తీసుకుంది. కాలినడకన వచ్చే భక్తులకు వైకుంఠ ఏకాదశి నుంచి ఉచిత లడ్డు ఇవ్వాలని ఈరోజు జరిగిన పాలక మండలి సమావేశం నిర్ణయించింది. ఈ నెల 29 నుంచి టీటీడీ కాటేజీలలోనే భక్తులకు ఉచితంగా అన్నదానం చేయాలని తీర్మానించింది.
ఈ రోజు సమావేశంలో తీసుకున్న కొన్ని ముఖ్య నిర్ణయాలు:
* 3.75 కోట్ల రూపాయలతో తిరుచానూరు ఆలయానికి మరమ్మతులు
* ఈ నెల 15న 22వేల ఆలయాలలో మనగుడి కార్యక్రమం నిర్వహణ.
* బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ ఉద్యోగులకు బహుమతులు ఇవ్వాలని నిర్ణయం. 10, 5 వేల రూపాయల చొప్పున బహుమతులు.
* తిరుమలను నో ఫ్లైయింగ్ జోన్గా నిర్ణయించాలని కేంద్రాన్ని మరోమారు కోరాలని పాలక మండలి నిర్ణయం.
ఇదిలా ఉండగా, కేరళ హైకోర్ట్ తీర్పు ప్రకారం సమాచార హక్కు టీటీడీకీ వర్తించదని టిటిడి ఇఓ చెప్పారు.