మే 1న టీటీడీ పాలకమండలి ప్రమాణం

29 Apr, 2015 11:29 IST|Sakshi
మే 1న టీటీడీ పాలకమండలి ప్రమాణం

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్తగా ఏర్పడిన ధర్మకర్తల మండలి మే 1వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనుంది. తిరుమలలో బుధవారం ఉదయం ఆలయ జేఈవో శ్రీనివాసరాజు మీడియాతో మాట్లాడారు. శుక్రవారం ఉదయం చైర్మన్ సహా పాలకమండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారని వెల్లడించారు.

కాగా టీటీడీ పాలకమండలి చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి నియమితులైన విషయం తెలిసింది. చదలవాడతో పాటు సుమారు 18 మంది సభ్యులు  టీటీడీ పాలకమండలిలో నియమితులైయ్యారు.

మరిన్ని వార్తలు