తిరుమల: తిరుమలలో హోటళ్లపై తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అధికారులు కొరడా ఝుళిపించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఐదు హోళ్లను సీజ్ చేశారు. పలు హోటళ్లకు నోటీసులు జారీ చేశారు. తిరుమలలో హోటళ్లలో అధిక ధరలకు ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారని దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడంతో టీటీడీ అధికారుల్లో కదలిక వచ్చింది.