మూడు దశాబ్దాల సేవలకు వీడ్కోలు

8 Apr, 2017 11:45 IST|Sakshi
మూడు దశాబ్దాల సేవలకు వీడ్కోలు

విశాఖ: మూడు దశాబ్దాలకు పైగా భారత నేవీకి వైమానిక సేవలు అందించిన ఓ విమానం తన సేవలకు వీడ్కోలు పలుకుతుంది. నావికా దళానికి టీయూ 142 ఎం అనే విమానం గత 32 ఏళ్లుగా తన సేవలు అందిస్తోంది. ఈ రిటైర్ అవుతున్న విమానాన్ని రిసీవ్ చేసుకోవడానికి సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, తదితరులు పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు.

ఐఎన్ఎస్ డేగలో ఈ నేవీ విమానం రిటైర్మెంట్ కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నారు. త్వరలో విశాఖలోని బీచ్ రోడ్డులో సందర్శన కోసం టీయూ 142ఎం విమానాన్ని ఉంచడానికి నిర్ణయం తీసుకున్నారు.

మరిన్ని వార్తలు