-

రోడ్డుప్రమాదంలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు మృతి

2 Jul, 2016 16:43 IST|Sakshi

గుడ్లవల్లేరు (కృష్ణా జిల్లా) : వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో బైక్ పై ఉన్న ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం పెంజెండ్ర గ్రామ శివారులో శనివారం చోటుచేసుకుంది. కళాశాల నుంచి ఇంటికి వెళ్తున్న విద్యార్థులను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో.. ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందిచారు. విద్యార్థుల వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు