వాగులో పడి ఇద్దరు చిన్నారులు మృతి

3 May, 2016 18:20 IST|Sakshi

విశాఖపట్టణం : వాగు వద్దకు ఆడుకునేందుకు వెళ్లిన ఇద్దరు బాలురు వాగులోకి దిగి ప్రమాదవశాత్తు మృత్యువాతపడ్డారు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా చోడవరం మండలం గౌరీపట్నంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. సదరు బాలురు ఇద్దరు వాగు వద్ద ఆడుకునేందుకు వెళ్లారు. ఆ క్రమంలో వారు వాగులోకి దిగి... నీటి మునిగి మరణించారు.

స్థానికులు ఆ విషయాన్ని గమనించి... మృతదేహాలను వెలికి తీసి.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో బాలుర కుటుంబ సభ్యులు దుఖఃసాగరంలో మునిగిపోయారు.

>
మరిన్ని వార్తలు