నెల్లూరులో డెంగ్యూ పంజా: ఇద్దరి మృతి

18 Oct, 2015 10:35 IST|Sakshi

గూడూరు : నెల్లూరు జిల్లా గూడురు మండలం చెన్నూరులో విష జ్వరాలు వణికిస్తున్నాయి. డెంగ్యూ జ్వరంతో ఇద్దరు మృత్యువాత పడడంతో గ్రామంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.

దీనికి తోడు ఇప్పటికే 10 మందికి డెంగీ నిర్థారణ కావడంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇద్దరు మరణించారని...ఇప్పటికైనా వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
 

మరిన్ని వార్తలు