చెరువులో మునిగి ఇద్దరు చిన్నారుల మృత్యువాత

20 Jun, 2015 15:26 IST|Sakshi

డెంకాడ ( విజయనగరం) : విజయనగరం జిల్లా డెంకాడ మండలం రఘుమండ గ్రామంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు చెరువు నీటిలో మునిగి మృతి చెందారు. గ్రామస్తుల కథనం ప్రకారం... 9వ తరగతి చదివే పల్లా సునీల్, 8వ తరగతి చదువుతున్న పల్లా హరి శనివారం పశువులను తీసుకుని చెరువు సమీపంలోకి వెళ్లారు. కాగా చెరువులో నీటిపై వాలిన పక్షులను పట్టుకోవాలన్న సరదాతో లోపలికి దిగారు. ఈత రాకపోవడంతో మునిగిపోయి ప్రాణాలు వదిలారు. గ్రామస్తులు ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని వార్తలు