రెండు వర్గాలు ఘర్షణ: పలువురికి గాయాలు

10 Jun, 2014 10:59 IST|Sakshi

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరులో ఉద్రిక్తత ఏర్పడింది. చేపల చెరువు విషయంలో రెండు వర్గాల మధ్య నెలకొన్న స్వల్ప వివాదం మంగళవారం ఘర్షణకు దారి తీసింది. దాంతో ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఆ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. గ్రామస్థులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హుటాహుటిన ఏల్చూరుకు చేరుకున్నారు. గ్రామంలో పరిస్థితిని సమీక్షించారు. ఎక్కడ ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా గ్రామంలో మోహరించారు.

మరిన్ని వార్తలు