బైక్-లారీ ఢీ : ఇద్దరికి తీవ్రగాయాలు

18 Aug, 2015 18:23 IST|Sakshi

విశాఖపట్నం (అనంతగిరి) : ఎదురెదురుగా వస్తున్న లారీ, బైక్ ఢీకొనడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన అనంతగిరి మండలం బీస్‌పురం గ్రామం వద్ద మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న పూజారి శివనాయుడు అనే వ్యక్తికి కుడికాలు విరగగా, కోనేటి సద్దు అనే వ్యక్తికి ఎడమకాలు విరిగింది.

క్షతగాత్రులను హుటాహుటిన విజయనగరం జిల్లా శృంగవరపుకోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు