హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి

16 Mar, 2016 17:12 IST|Sakshi

ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం రాజుపాలెం వద్ద హైవేపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. జాతీయ రహదారి మధ్యలో విజయవాడ వైపు వెళ్లే మార్గంలో డివైడర్‌పై ఉన్న మొక్కలకు నీళ్ల ట్యాంకర్ సాయంతో ఓ కూలీ నీరు పెడుతున్నాడు. అదే సమయంలో వచ్చిన ఓ ట్రాలీ నీళ్ల ట్యాంకర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రాలీ డ్రైవర్‌తోపాటు, నీరు పెడుతున్న కూలీ కూడా మృతి చెందాడు.

 

>
మరిన్ని వార్తలు