ఆటోని ఢీకొన్న లారీ: ఇద్దరి మృతి

26 May, 2014 14:41 IST|Sakshi

గుంటూరు: ఫిరంగిపురంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఎదురుగా వస్తున్న ఆటోను  లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆటో డ్రైవర్, ఒక మహిళ మృతి మృతి చెందారు.


ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడ్డారు. గాయపడినవారిలో ఒక బాలుడు కూడా ఉన్నాడు. వారిని ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు