ఎర్ర చందనం దుంగలు స్వాధీనం

7 Jul, 2019 18:30 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్ కడప: మైదుకూరులో ఇద్దరు అంతరాష్ట్ర స్మగ్లర్లు పట్టుబడ్డారు. పోలీసుల తనిఖీల్లో ఎర్రచందనం కలపను అక్రమంగా తరలిస్తున్న వాహనం పట్టుబడగా, అందులో ఉన్న 90 దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి బరువు 3.30 టన్నులుగా ఉంది. పట్టుబడిన స్మగ్లర్లు తమిళనాడుకు చెందిన ఉలగంధన్ వెల్, పశ్చిమ బెంగాల్కు చెందిన రాణా దత్తలుగా అధికారులు గుర్తించారు. వీరి నుంచి 1 వాహనం, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు.

మరిన్ని వార్తలు