కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని కార్వాన్పేట ప్రాంతంలో ఆదివారం ఉదయం ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో జయశ్రీ (30), ఆమె కుమారుడు సాయి కార్తీక్ (6)కు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో జయశ్రీ భర్త కర్నూలులో ఉన్నారు. ఆయన ఎస్బీఐ ఉద్యోగి.