గోదావరిలో ఈతకెళ్లి ఇద్దరు విద్యార్థుల గల్లంతు

23 Feb, 2016 16:10 IST|Sakshi

పోలవరం:  పశ్చిమ గోదావరి జిల్లాలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. పోలవరం మండలం రామయ్యపేట వద్ద గోదావరి నదిలో ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు.

గల్లంతైన విద్యార్థులు ఎం. వీరాబాబు(19), కె. అశోక్(19)గా గుర్తించారు. వీరిద్దరూ కొయ్యలగూడెంలోని ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ చదువుతున్నారు.  అశోక్‌ స్వగ్రామం పొంగుటూరు కాగా..వీరబాబుది కన్నాపురం గ్రామం. అశోక్ మృతదేహాన్ని వెలికి తీయగా..వీరబాబు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్థుల మృతితో ఆ గ్రామాల్లో విషాదం నెలకొంది.

మరిన్ని వార్తలు