రోడ్డు ప్రమాదంలో తల్లీకూతుళ్లు మృతి

13 Mar, 2017 07:56 IST|Sakshi

కదిరి (అనంతపురం జిల్లా): అనంతపురం జిల్లా కదిరి పట్టణం వెలుగు కాలనీ సమీపంలో  ఆంజనేయస్వామి గట్టు వద‍్ద ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు దుర్మరణం చెందారు. వెలుగు కాలనీకి చెందిన పార్వతమ్మ అనే మహిళ కూతురు సునీత, కొడుకు ఆంజనేయులుతో కలిసి ఆటోలో పుట్టపర్తిలో చికిత్సపొందుతున్న బంధువులను చూసేందుకు వెళ్లింది.

తిరుగు ప్రయాణంలో వెలుగు కాలనీ వద్ద ఆటోను వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఆటోలో ఉన్న తల్లీకూతుళ్లు పార్వతమ్మ, సునీత అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన ఆంజనేయులును చికిత్స నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున‍్న కదిరి పోలీసులు సంఘటన స‍్థలానికి వెళ్ళి మృతదేహాలను పోస్టుమార‍్టం నిమిత‍్తం కదిరి ప్రభుత‍్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు