అరబిందో ఫార‍్మాలో ప్రమాదం

11 Aug, 2019 12:13 IST|Sakshi

ఇద్దరు మృతి

సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలోని పైడి భీమవరంలోని అరబిందో ఫార్మాలో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తూ బాయిలర్‌ పేలి ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతి చెందినవారిని రాహుల్‌, రాజారావుగా గుర్తించారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ కార్మిక సంఘాలు ఫ్యాక్టరీ గేటు బయట ఆందోళనకు దిగారు.
 

>
మరిన్ని వార్తలు