పెన్నానదిలో ఈతకెళ్లి ఇద్దరి గల్లంతు

30 Dec, 2015 22:33 IST|Sakshi

కోవూరు: నెల్లూరు జిల్లాలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. కోవూరు మండలం వేగూరు కండ్రిగ గ్రామం సమీపంలో ఉన్న పెన్నానదిలో ఈతకెళ్లి  చక్రపాణి(21), జైపాల్(21) అనే ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడటంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. యువకుల మృతితో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. 

మరిన్ని వార్తలు