యూసీఐఎల్ కార్మికుల ధర్నా

11 Sep, 2015 17:13 IST|Sakshi

వేముల : వైఎస్సార్ జిల్లా వేముల మండలంలోని యూరేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) కార్మికులు శుక్రవారం విధులు బహిష్కరించి ధర్నాకు దిగారు. దీంతో యూరేనియం తవ్వకాలతోపాటు, ఉత్పత్తి నిలిచిపోయింది. డిమాండ్ల సాధన కోసం కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఇంటి భత్యం పెంచాలని, తమ పిల్లలకు స్కూల్ ఫీజులు చెల్లించాలని, ఉచిత బస్సు సౌకర్యం, తాగునీటి సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు