'అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తున్నారు'

25 May, 2015 17:38 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. సోమవారం ఆయన హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల ప్రకారం వెంటనే రైతు, డ్వాక్రా రుణాల్ని మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గొప్పలు చెప్పుకోవడానికే చంద్రబాబునాయుడు విజయయాత్ర సభలు నిర్వహిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు