భిక్షాటన చేస్తూ నిరసన తెలిపిన నిరుద్యోగులు

27 Aug, 2015 15:34 IST|Sakshi
భిక్షాటన చేస్తూ నిరసన తెలిపిన నిరుద్యోగులు

విశాఖపట్నం : విశాఖ నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గురువారం ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో నిరుద్యోగులు భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. బాబు వస్తేనే జాబు వస్తుందన్న మాట నిలబెట్టుకోవాలని, వెంటనే ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఉద్యోగం కల్పించలేకపోతే నిరుద్యోగభృతి కింద నెలకు రెండు వేల రూపాయలు ఇస్తామన్న మాటైనా నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా నిరుద్యోగులు డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు