సైన్యంలో ఉద్యోగం ఇప్పిస్తానని మోసం!

5 Sep, 2014 18:36 IST|Sakshi
ప్రకాశం: సైన్యంలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడినట్టు బాధితులు తాలుకా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఒంగోలులో డిఫెన్స్‌ అకాడమి పేరుతో ఒక్కో నిరుద్యోగి నుంచి 20 వేల రూపాయల చొప్పున 15 లక్షలు వసూలు చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
ఉద్యోగం ఇవ్వకుండా తప్పించుకున్న నిర్వాహకుడు అంజనేయుల్ని నిరుద్యోగులు ప్రశ్నించడంతో పరారైనట్టు పోలీసులకు బాధితులు వెల్లడించారు. ఆంజనేయులపై కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. 
మరిన్ని వార్తలు