పరుపులో గుర్తుతెలియని మృతదేహం

17 Dec, 2015 19:04 IST|Sakshi

వైఎస్సార్ జిల్లా కేంద్రం కడప నగరంలోని ఉక్కాయపల్లి చెత్త డంపింగ్ యార్డులో పరుపులో చుట్టిన మృతదేహం కనిపించింది. విపరీతమైన దుర్వాసన వస్తుండటంతో స్థానికుల ఫిర్యాదు మేరకు మున్సిపల్ సిబ్బంది గురువారం సాయంత్రం పరుపును విడదీసి చూశారు. అందులో వృద్ధుడి మృతదేహం కనిపించింది. పూర్తిగా కుళ్లిపోయి గుర్తించడానికి వీల్లేకుండా ఉంది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


 

మరిన్ని వార్తలు