పొదల్లో గుర్తుతెలియని మృతదేహం

19 Dec, 2015 18:51 IST|Sakshi

ఎచ్చర్ల (శ్రీకాకుళం) : శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలకేంద్రంలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. జాతీయరహదారిపై తమ్మినీడుపేట సమీపంలోని టోల్‌గేట్ వద్ద పొదల్లో శనివారం మధ్యాహ్నం గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వటంతో డీఎస్పీ భార్గవప్రసాదరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. చుట్టుపక్కల వారిని విచారించి, మృతుని ఆచూకీ కోసం దర్యాప్తు ప్రారంభించారు.

>
మరిన్ని వార్తలు