కారులో ఏముందో..!

20 Dec, 2018 10:03 IST|Sakshi
పోలీసులు స్వాధీనం చేసుకున్న కారు

చిత్తూరు  ,పుంగనూరు : పుంగనూరు సమీపంలో క్రిష్ణమరెడ్డిపల్లె రోడ్డులో గుర్తు తెలియని కారును పోలీసులు బుధవారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నారు. ఏపి 03 బీజెడ్‌ 2373 నం బరు గల డస్టున్‌ కారు అదుపు తప్పి పొలా ల్లోకి దూసుకుపోయి దెబ్బతింది. గ్రామస్తులు దీనిని గుర్తించి ఫిర్యాదు చేయడంతో పోలీసులు పరిశీలించారు. కారులో మూట లు ఉండటం గమనించారు. పోలీసులు వా టిని తెరవకపోవడంతో వాటిల్లో ఏముందో నని ఆసక్తి రేపింది; ప్రజల్లో చర్చనీయాంశమైంది. కారు నంబర్‌ ఆధారంగా పోలీసులు దీనికథేమిటో తేల్చే ప్రయత్నంలో పడ్డారు.

మరిన్ని వార్తలు