తెలంగాణపై 31న యూపీఏ భేటీ

28 Jul, 2013 15:55 IST|Sakshi

తెలంగాణ అంశంపై చర్చించేందుకు యూపీఏ సమన్వయ కమిటీ ఈనెల 31న సమావేశం కానుంది. బుధవారం సాయంత్రం 4 గంటలకు ప్రధాని నివాసంలో ఈ సమావేశం జరగనుంది. యూపీలో భాగస్వాములుగా ఉన్న శరద్‌ పవార్, అజిత్ సింగ్, ఫరుఖ్ అబ్దుల్లా, ఇతర నేతలు ఈ భేటీకి హాజరుకానున్నారు.

తెలంగాణపై సంప్రదింపులు పూర్తయి కాంగ్రెస్, యూపీఏ ప్రభుత్వం నిర్ణయం వెలువరించాల్సిన వున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. దీని ద్వారా తెలంగాణపై యూపీఏ భాగస్వామ్య పార్టీల వైఖరిని కాంగ్రెస్ తెలుసుకునే అవకాశముంది. యూపీఏ సమన్వయ కమిటీ సమావేశం తర్వాత కాంగ్రెస్ సీడబ్ల్యూసీ భేటీ ఉంటుంది.

మరిన్ని వార్తలు