రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శిగా వాణీమోహన్‌

31 May, 2020 09:53 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నూతన కార్యదర్శిగా వాణీ మోహన్‌ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సహకార శాఖ కమిషనర్, ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ కో–ఆపరేటివ్‌ ఫెడరేషన్‌ ఎండీ వాణీ మోహన్‌కు ఈ బాధ్యతలను కూడా అదనంగా అప్పగించారు.    

మరిన్ని వార్తలు