వాసిరెడ్డి పద్మకు క్యాబినెట్‌ హోదా

21 Aug, 2019 17:07 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మకు ప్రభుత్వం కేబినెట్‌ హోదా కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 8వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ నియమితులయిన విషయం తెలిసిందే.  దీంతో ఈ నెల 26న ఉదయం 10.30 గంటలకి తాడేపల్లిలోని సీఎస్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్లో ఆమె పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

>
మరిన్ని వార్తలు