‘నీచ రాజకీయాలు ఇప్పటికైనా మానుకోవాలి’

13 May, 2020 10:22 IST|Sakshi

సాక్షి, విజయవాడ : టీడీపీ నేతలు కరోనా వైరస్‌ను కూడా రాజకీయంగా వాడుకుంటున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ద్వారావతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వలస కూలీలకు నిత్యావసర సరుకులను మంత్రి పంపిణీ చేశారు. సామాన్య ప్రజలపై ఆర్థిక భారం వేసే పనిని తమ ప్రభుత్వం చెయ్యదన్నారు. సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో పరిపాలిస్తున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఇప్పటికైనా నీచ రాజకీయాలు మానుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు