పోలింగ్ సరళిపై విజయమ్మ ఆరా

8 May, 2014 01:50 IST|Sakshi
పోలింగ్ సరళిపై విజయమ్మ ఆరా
  • పార్లమెంట్ నియోజకవర్గంలో విస్తృత పర్యటన
  •  సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు, విశాఖపట్నం లోక్‌సభ అభ్యర్థి వై ఎస్ విజయమ్మ బుధవారం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో విస్తృతంగా పర్యటిం చారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని వివిధ పోలింగ్ బూత్‌లకు వెళ్లి ఓటింగ్ సరళిపై ఆరా తీశారు. గాజువాక హైస్కూల్‌లో 21 బూత్‌లు అధికారులు ఏర్పాటుచేసి పోలింగ్ నిర్వహించారు.

    అక్కడకు వెళ్లి విజయమ్మ పోలింగ్ తీరును గమనించారు. పార్టీ గాజువాక అసెంబ్లీ అభ్యర్థి నాగిరెడ్డి ఆమెను కలిశారు. విశాఖ తూర్పు, ఉత్తరం, దక్షిణం, పశ్చిమ, ఎస్.కోట నియోజకవర్గాల్లోని పలు పోలింగ్ బూత్‌లకు వెళ్లి ఓటర్ల నాడిని గమనించారు. భీమిలి నియోజకవర్గం పరిధిలోని మధురవాడ జెడ్పీ హైస్కూల్‌ను సాయంత్రం సందర్శించారు. పోలింగ్ కేంద్రం నుంచి బయటికి వస్తుండగా విజయమ్మను అభిమానులు చుట్టుముట్టారు. ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె వెంట పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు