టీడీపీ నేత లా కాలేజీలో విజిలెన్స్‌ తనిఖీలు

2 Dec, 2019 19:01 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ కడప: జిల్లాలోని టీడీపీ నేత గోవర్ధన్‌రెడ్డి చెందిన న్యాయ కళాశాలలో కేంద్ర విజిలెన్స్‌ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్న వారిని రెగ్యులర్‌ విద్యార్థిగా తన న్యాయ కళాశాలలోని సిబ్బంది అడ్మిషన్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఓ కేసు విచారణలో తమిళనాడుకు చెందిన ఉద్యోగికి టీడీపీ నేత లా కళాశాలలో అడ్మిషన్‌ ఇచ్చినట్లు కోర్టు గుర్తించింది. అయితే కోర్టు ఆదేశాలతో కళాశాలలో తనిఖీలు చేపట్టినట్టు కేంద్ర విజిలెన్స్‌ అధికారులు పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు