విజ్ఞాన్‌ వర్సిటీ ఆన్‌లైన్‌ పరీక్ష ఫలితాలు విడుదల

12 Jul, 2020 05:19 IST|Sakshi
ఫలితాలు విడుదల చేస్తున్న రిజిస్ట్రార్‌ రఘునాథన్, డీన్‌ పీఎంవీ రావు

చేబ్రోలు (పొన్నూరు): గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్‌ యూనివర్సిటీ నిర్వహించిన బీటెక్‌ చివరి సంవత్సరం రెండో సెమిస్టర్‌ ఆన్‌లైన్‌ పరీక్ష ఫలితాలను శనివారం విడుదల చేసినట్లు వర్సిటీ వీసీ ఎంవైఎస్‌ ప్రసాద్‌ తెలిపారు. విద్యార్థులకు ఆన్‌లైన్‌లో రియల్‌ టైం వీడియో మానిటరింగ్‌ సిస్టంతో పరీక్షలు నిర్వహించామని, వారం రోజుల్లోనే ఫలితాలను వెల్లడించామని పేర్కొన్నారు. కార్యక్రమంలో విజ్ఞాన్‌ విద్యా సంస్థల చైర్మన్‌ లావు రత్తయ్య, రిజిస్ట్రార్‌ ఎంఎస్‌ రఘునాథన్, డీన్‌ పీఎంవీ రావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు