వీరభద్రుని గద్దెకు పోటెత్తిన భక్తులు

8 Oct, 2019 10:41 IST|Sakshi

సాక్షి, తూర్పు గోదావరి : విజయదశమి రోజున ఆలయాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. భక్తుల రద్దీతో ప్రముఖ దేవాలయాలు కిక్కిరిసిపోతున్నాయి. జిల్లాలోని గోకవరంలో వీరభద్రుని గద్దెకు పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. స్వామి, అమ్మవార్లకు పెద్దఎత్తున అభిషేకాలు జరిపిస్తున్నారు. దేవీచౌక్‌ ఆలయంలో మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

మరిన్ని వార్తలు