సాక్షి, అమరావతి : నమ్మిన వారు ఆపదలో తనకు అండగా నిలువలేదన్న నిస్పృహతోనే కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడ్డారని వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి అన్నారు. బుధవారం ట్విటర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. ప్రతిపక్షనేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తను కొనుగోలు చేసిన 23 మంది వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను అనర్హులుగా చేయకుండా కోడెలను వాడుకుని వదిలేశారని విమర్శించారు. కోడెల మరణాన్ని చంద్రబాబు రాజకీయం చేసి ఆయనకు ఆత్మశాంతి లేకుండా వేధిస్తున్నారని అన్నారు.
చదవండి : కోడెల మృతి: బీజేపీ అధికార ప్రతినిధి సంచలన వ్యాఖ్యలు