-
సాక్షి, అమరావతి : లాక్డౌన్ వేళ ఆపదలో ఉన్న పేదలకు నిత్యావరసరాలు, అన్నదానాలు చేస్తున్నవారందరికి వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. చిన్నపిల్లలు, స్తోమత లేనివారు సైతం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు పంపిస్తూ గొప్ప మనసును కనబరుస్తున్నారని ప్రశంసించారు. సాటి పౌరుల పట్ల వారికున్న అభిమానం వెలకట్టలేనిదన్నారు. ఆపద సమయంలో పేదలను సహాయం చేస్తున్న వారందరికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇంతకంటే అనువైన సమయం దొరకలేదా మీకు?
‘ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేక ఉపాధి కోల్పోయిన పేదలకు ప్రభుత్వం వెయ్యి ఎలా పంపిణీ చేస్తుందని కన్నా, సిపిఐ రామకృష్ణలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేసారు. వీళ్ల యజమానేమో ఐదు వేలివ్వమని రంకెలేస్తుంటాడు. రాజకీయాలు చేయడానికి ఇంత కంటే అనువైన సమయం దొరకలేదా మీకు?’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.